ప్రభుత్వ శాఖలపై నేటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖపై ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో తొలి సమీక్ష చేయనున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో వెంటనే చేపట్టాల్సిన చర్యలు, దీర్ఘకాల ప్రణాళికపై అధికారులతో చర్చించనున్నారు.