టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు. ఇంకా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. అనంతరం హంద్రీనీవా ప్రాజెక్టును పరిశీలించనున్నారు.