శానిటేషన్ కార్మికులకు న్యాయం జరగాలి: ఏఐటీయూసీ

67చూసినవారు
శానిటేషన్ కార్మికులకు న్యాయం జరగాలి: ఏఐటీయూసీ
చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేసేటువంటి శానిటేషన్ కార్మికులకు పెండింగ్లో ఉన్న ఐదు నెలల జీతాలు ఇవ్వాలని, యూనిఫామ్, గుర్తింపు కార్డు ఇవ్వాలని సోమవారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఏ ఐ టి యు సి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ శానిటేషన్ కార్మికులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

సంబంధిత పోస్ట్