పరిశుభ్రతతో అంటురోగాలు దూరం

84చూసినవారు
పరిశుభ్రతతో అంటురోగాలు దూరం
వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అంటురోగాలు దరి చేరవని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు హేమశ్రీ అన్నారు. పట్టణంలోని పలు సంక్షేమ వసతి గృహాలను సందర్శించి సీజనల్ వ్యాధులపై మంగళవారం అవగాహన కల్పించారు. తరచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు. కాచి చల్లార్చి వడపోసిన నీటిని తాగాలన్నారు. మరుగుదొడ్లు, హాస్టల్ పరిసరాలు, వంటగదులు, పిల్లల గదులను శుభ్రంగా ఉంచాలని వార్డెన్లకు సూచించారు.

సంబంధిత పోస్ట్