నీటి పారుదల రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి

67చూసినవారు
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వ్యవసాయ రంగానికి, తాగునీటికి ప్రయోజనం కల్పించేందుకు నీటి పారుదల రంగానికి ప్రాధాన్యత కల్పించాలని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కోరారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. నియోజకవర్గానికి నీటి వసతి కల్పిస్తే వ్యవసాయ రంగం అభివృద్ధి చెంది రైతు కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్