ఘనంగా ప్రారంభమైన మహా కుంభాభిషేకం

57చూసినవారు
ఘనంగా ప్రారంభమైన మహా కుంభాభిషేకం
నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం మహా కుంభాభిషేకం శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైనది. మొదటి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ కాళహస్తి శుకబ్రహ్మ ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యా స్వరూపానంద గిరి స్వామి వారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ధార్మిక మార్గంలో భక్తులు తమను తాము చైతన్య పరుచుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్