నగరి నియోజకవర్గం నిండ్ర మండలం కూనమరిజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు సోమవారం నూతన సంవత్సర వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి అమ్మవారికి అభిషేకం నిర్వహించి పట్టువస్త్రాలు పూలమాలలతో అత్యంత వైభవంగా అలంకరించి కర్పూర నీరాజనాల నడుమ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అమ్మవారి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు.