సంబరాలలో మునిగిన జనసేన పార్టీ నాయకులు

76చూసినవారు
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో జనసేన పార్టీ నాయకులు మంగళవారం సంబరాలలో మునిగిపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికలలో 21చోట్ల పోటీ చేసి 21చోట్ల దిగ్విజయంగా గెలుపొందడంతో తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. జై జనసేన అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్