బంగారు తిరుచ్చి పై పద్మావతి దేవి విహారం

53చూసినవారు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచ్చి పై నాలుగు మాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి, నిత్య కైంకర్యాలు, అభిషేకం నిర్వహించారు. సాయంత్రం విశేషాలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు తిరుచ్చి పై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు.

సంబంధిత పోస్ట్