బస్టాండులో ఆక్రమణల తొలగింపు

74చూసినవారు
చిత్తూరు నగరంలోని పాత బస్టాండు, పొన్నీయమ్మన్ వీధిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను నగరపాలక అధికారులు గురువారం తొలగించారు. జేసీబీ సాయంతో రోడ్డుకు ఇరువైపులా కాల్వ గట్టుపైన ఉన్న దిమ్మెలను పడగొట్టారు. గత 10 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న పండ్ల వ్యాపారస్తులను ఖాళీ చేయించారు. ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్