అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలి

52చూసినవారు
చిత్తూరు నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. మంగళవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ నుంచి నగరపాలక కమిషనర్ గా వచ్చిన అరుణకు శాఖలపై పట్టు లేదన్నారు. అవినీతిని నిరోధించాల్సింది పోయి తన సంతకాలతో అవినీతిని ప్రోత్సహిస్తున్నారన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధితులను శిక్షించాలన్నారు.

సంబంధిత పోస్ట్