లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నికయ్యారు. విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశం అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్గాంధీ నియామక నిర్ణయాన్ని తెలియజేస్తూ ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్కు లేఖ రాశానని వేణుగోపాల్ విలేకరుల సమావేశంలో తెలిపారు.