రామకుప్పం: బిజెపి జెండా ఆవిష్కరణ

50చూసినవారు
రామకుప్పం మండలం మొద్దులవంక గ్రామంలో ఆదివారం ఎన్డీఏ కూటమి నేతలు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రుడు, కుప్పం జనసేన సమన్వయకర్త నరేశ్, మండల ఎన్డీఏ కూటమి నేతలు బీజేపీ జెండా ఆవిష్కరించారు. మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు లోకేశ్ రెడ్డి మాట్లాడుతూ. ప్రధాని నరేంద్రమోడి నేతృత్వంలో భారతదేశం అభివృద్ధి దిశగా పయనిస్తోందని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్