రోడ్డు ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికుడికి గాయాలు

59చూసినవారు
రోడ్డు ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికుడికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికుడు గాయపడినట్లు సోమవారం మదనపల్లి పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు మేరకు బి కొత్తకోట మండలం తాకటంవారి పల్లెకు చెందిన నాగరాజు (46) కూలి పనుల కోసం కొత్తకోటకు బయలుదేరారు. చెరువు మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇవ్వడం కోసం పక్కకు జరిగి అదుపుతప్పి కింద పడిపోయారు. ప్రమాదంలో గాయపడిన నాగరాజును మదనపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

సంబంధిత పోస్ట్