భార్యను చంపిన భర్త అరెస్ట్

5099చూసినవారు
కురబలకోట మండలంలో భార్యను హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సీఐ సద్గురుడు, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. లక్కసముద్రం పంచాయతీ మేకలవారిపల్లెకు చెందిన లక్ష్మిరెడ్డి అర్ధరాత్రి మద్యం తాగొచ్చి కోడి కోసం భార్య తో గొడవపడ్డాడు. ఆగ్రహించిన భార్యను కొడవలితో అతికిరాతకంగా నరికి చంపేశాడు. ముదివేడు క్రాస్ వద్ద నిందితుడిని గురువారం సాయంత్రం అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్