టీడీపీలోకి చేరికలు
గంగవరం మండలంలోని గండ్రాజుపల్లి పంచాయతీ మార్లపల్లికి చెందన పలువురు యువత మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో గ్రామానికి చెందిన ఆరిఫ్, చిరంజీవి, పుష్పనాథ్, రాజేంద్రప్రసాద్, ప్రతాప్, సంజయ్, రాజేష్ నాయుడు, శంకర తదితరులున్నారు.