![పెళ్లి చూపులకు వెళ్లి వస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి... పెళ్లి చూపులకు వెళ్లి వస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి...](https://media.getlokalapp.com/cache/4b/1d/4b1d3a3bd23be4ac2c438a4aa99c741c.webp)
పెళ్లి చూపులకు వెళ్లి వస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి...
చంద్రగిరి మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఎం. కొంగరవారిపల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో బాలు అనే యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. మదనపల్లి మండలం రెడ్డివారిపల్లికి చెందిన బాలు (26) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి చూపుల నిమ్మిత్తం బాలు బుధవారం రాత్రి బెంగళూరు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు తన తమ్ముడు వాసు, తల్లి శంకరమ్మ, బంధువు ప్రియాంక, స్నేహితుడు దిలీప్తో కలిసి బయల్దేరాడు. గురువారం ఉదయం పెళ్లి చూపులు ముగించుకుని తిరిగి మధ్యాహ్నం బెంగళూరు కు బయల్దేరగా శుక్రవారం తెల్లవారుజామున ఎం.కొంగరవారిపల్లి వద్ద వాహనానికి అడ్డంగా ఆవు రావడంతో వాహనం నడుపుతున్న అతని స్నేహితుడు దిలీప్ తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి ఫల్టీలు కొట్టి బోల్తా పడింది. బాలు తలకు తీవ్ర గాయం కాగా తల్లి శంకరమ్మ, దిలీప్కు స్వల్ప గాయాలయ్యాయి. 108 సిబ్బంది క్షతగాత్రులను తిరుపతి రుయాకు తరలించగా బాలు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.