జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ - కలెక్టర్

2545చూసినవారు
జిల్లాలో ఎన్నికల సందర్భంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్ అన్నారు. సోమవారం సాధారణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పీలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న పోలింగ్ సరళిని ఆయన జెసి ఫర్మన్ అహ్మద్ ఖాన్, పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు.   అన్నమయ్య జిల్లాలోని 1609 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోందన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్