సూర్యప్రభ వాహనంపై వినాయకుడి విహారం

77చూసినవారు
చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం రాత్రి సూర్య ప్రభ వాహనం సందర్భంగా సూర్యప్రభ పై సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడు పురవీధులలో దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా బొమ్మ సముద్రానికి చెందిన ఇంద్రసేన నాయుడు వారి కుమారులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గురు ప్రసాద్, మురళి మోహన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్