పట్టణంలో పర్యటించనున్న ఎంపీ మిథున్ రెడ్డి

64చూసినవారు
పట్టణంలో పర్యటించనున్న ఎంపీ మిథున్ రెడ్డి
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్ రెడ్డి సోమవారం పుంగనూరులో పర్యటించనున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ భాష ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు పట్టణానికి చేరుకుంటారని తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్