పట్టణంలో ఫాగింగ్ చేసిన మున్సిపల్ అధికారులు

84చూసినవారు
పట్టణంలో ఫాగింగ్ చేసిన మున్సిపల్ అధికారులు
పుంగనూరు పట్టణంలో దోమల నివారణ చర్యలలో భాగంగా ఫాగింగ్ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాల సీజన్లో నీటి నిల్వలతో దోమలు వృద్ధి చెంది అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలందరూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని, అదేవిధంగా ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు ఉండకుండా చూడాలని కమిషనర్ కోరారు.

సంబంధిత పోస్ట్