కోలాహలంగా వినాయక నిమజ్జనాలు

81చూసినవారు
చిత్తూరు జిల్లా, పుంగునూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో వినాయకుని నిమజ్జనాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. గత 8 రోజులుగా పూజలు అందుకున్న వినాయక స్వామి విగ్రహాలను ఆదివారం సాయంత్రం నిమజ్జనానికి తరలించారు. పురవీధులలో ఊరేగిస్తూ కోలాహలంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. యువకులు నృత్యాలు చేస్తూ బళ్లారి డ్రమ్స్ తో బానసంచ పేల్చుతూ అంగరంగ వైభవంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్