వరదయ్యపాళెంలో రేపు గ్రామసభ

77చూసినవారు
వరదయ్యపాలెం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామ సభ నిర్వహించనున్నట్లు శుక్రవారం ఈవో బసిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మైకు ద్వారా పంచాయతీ పరిధిలో దండోరా వేయించారు. గ్రామస్తులు అందరూ గ్రామ సభలో పాల్గొనవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. గ్రామ సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభ జరుగుతుందని చెప్పారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్