22 కేజీల గంజాయి స్వాధీనం

76చూసినవారు
ఏర్పేడు మండలంలో 22. 250 కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని నరసింహ, నవీన్ అనే ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి, సిఐ జయచంద్ర తెలిపారు. మంగళవారం ఏర్పేడు పోలీసు స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మండల కేంద్రంలోని వెంకటగిరి సర్కిల్లో ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి నుండి 22 కేజీల గంజాయి సీట్ చేశారు.

సంబంధిత పోస్ట్