గణేష్ నిమజ్జనం ఉత్సవ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలి

67చూసినవారు
గణేష్ నిమజ్జనం ఉత్సవ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలి
నిమజ్జనం, గణేష్ ఉత్సవము ప్రశాంతంగా జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని పెద్దతిప్ప సముద్రం పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ నరసింహుడు కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ మట్టి గణపతి విగ్రహాలను పెట్టడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. విగ్రహ మండపాల నిర్వాహకులు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని కోరారు.

సంబంధిత పోస్ట్