తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫల పుష్ప అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందుకోసం 10టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 60వేల కట్ ఫ్లవర్స్ ఉపయోగించారు. శ్రీవారి ఆలయం లోపల ఆపిల్, ద్రాక్ష, బత్తాయి, నారింజ, కర్బూజ, చెరకు వంటి పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలతో భూలోక వైకుంఠంగా శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు.