తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 6 గంటల సమయం

62చూసినవారు
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 6 గంటల సమయం
AP: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న 80,741 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 31,581 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కానుకల రూపంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు సమకూరిందని టీటీడీ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్