టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ.. పోలింగ్ ఏజెంట్లకు గాయాలు

48972చూసినవారు
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గాలు ఘర్షణకు దిగగా, ముగ్గురు టీడీపీ పోలింగ్ ఏజెంట్లకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. కడప జిల్లాలోని కమలాపురం మండలం కోగట్టంలోనూ వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఎన్నికల వాతావరణం చెడగొట్టవద్దని స్థానికులు ఆందోళన చేపట్టారు.

సంబంధిత పోస్ట్