పింఛన్ల పంపిణీకి బయల్దేరిన సీఎం చంద్రబాబు

53చూసినవారు
పింఛన్ల పంపిణీకి బయల్దేరిన సీఎం చంద్రబాబు
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయలమడకు సీఎం చంద్రబాబు మంగళవారం బయలుదేరారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం గ్రామస్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాగా, ఉదయం 11 గంటల వరకు 91.46 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 96 శాతానికి పైగా పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్