సీఎం చంద్రబాబు యువతకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా సరే ఆడవారికి జోలికి వెళ్లి.. పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతేకాకుండా ఎవరైనా ఆడవారిపై అత్యాచారానికి పాల్పడితే మాత్రం అదేవారికి ఆఖరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఇప్పటివరకు మర్యాదగా చెప్పా.. ఇక నుంచి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.