AP: పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. "రాష్ట్రాభివృద్ధికి జీవనాడి పోలవరం. వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రం. మేధావులు, నిపుణులు సహా అందరి సలహాలు తీసుకుంటాం. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి. ఏడు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా నిధులు తెచ్చుకోవాలి. 25 రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది." అని సీఎం పేర్కొన్నారు.