ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే విమానంలో లావేటరీలో పొగ తాగిన 38 ఏళ్ల వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఇండిగో విమానంలో బుధవారం సాయంత్రం ఈ సంఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. ముంబై విమానాశ్రయంలో విమానం దిగడానికి దాదాపు 50 నిమిషాల ముందు ఉత్తరప్రదేశ్కు చెందిన ఖలీల్ కాజమ్ముల్ ఖాన్ అనే ప్రయాణికుడు టాయిలెట్కు వెళ్లాడన్నారు. అక్కడ నిందితుడు సిగరెట్ తాగాడన్నారు.