పరీక్షల్లో సంస్కరణలకు వెబ్‌సైట్ ప్రారంభం

67చూసినవారు
పరీక్షల్లో సంస్కరణలకు వెబ్‌సైట్ ప్రారంభం
నీట్‌-యూజీ, యూజీసీ-నెట్‌ పరీక్షల్లో అక్రమాలు, పేపర్‌ లీకేజీలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగిన నేపథ్యంలో పరీక్షల నిర్వహణ విభాగం ఎన్‌టీఏలో సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో తమ అభిప్రాయాలకు తెలపాలని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కోరింది. 7 జులై 2024 వరకు ఇది అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

సంబంధిత పోస్ట్