పింఛన్లపై సీఎం జగన్ ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని
టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 'సీఎం జగన్ మాట తప్పి.. మడమ తిప్పారు. ఒక్కొక్కరికి రూ.30 వేలు ఎగనామం పెట్టారు. రూ. 200 ఉన్న పింఛన్ను చంద్రబాబు రూ. 2 వేలు చేశారు.
టీడీపీ హయాంలో కొత్తగా 20 లక్షల మందికి పింఛన్లు ఇచ్చాం. సీఎం జగన్ ఐదేళ్లలో పింఛన్ పెంచింది రూ. 750 మాత్రమే'నని అచ్చెన్న స్పష్టం చేశారు.