హైదరాబాద్లో బిర్యానీ తినేందుకు హోటల్కు వెళ్లిన కస్టమర్లపై సిబ్బంది కర్రలతో దాడి చేశారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి బిర్యానీ తినడానికి ఓ కుటుంబం అబిడ్స్లోని రెస్టారెంట్కు వెళ్లింది. మొత్తం 8 మంది కుటుంబ సభ్యులు హోటల్కు వెళ్లి.. బిర్యానీ ఆర్డర్ చేశారు. కానీ వారు ఆర్డర్ చేసిన బిర్యానీ సరిగ్గా ఉడకలేదు. దీంతో గొడవ ముదరడంతో హోటల్ సిబ్బంది.. ఆ ఫ్యామిలీపై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదయింది.