పాపాలు చేసిన వారిని తొక్కిపడేయండని క్రైస్తవులకు బ్రదర్ అనిల్ పిలుపునిచ్చారు. కడప కృపా చర్చిలో క్రైస్తవులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పాపులను తరిమికొట్టాలంటే ప్రార్థన సరిపోదు.. ధైర్యంగా ఎదుర్కోవాలి. న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. ఎవరికీ భయపడకండి.. ఏసుప్రభు అండగా ఉన్నాడు. దేవుడిపై విశ్వాసం ఉంచి నిర్ణయం తీసుకోండి’’ అని బద్రర్ అనిల్ అన్నారు.