తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మీరట్లో షాకింగ్ ఘటన జరిగింది. రిమ్షా అనే యువతి తన కజిన్ సోదరి హల్దీ ఫంక్షన్ కి వెళ్ళింది. ఆ ఫంక్షన్ లో పిల్లలతో కలిసి రిమ్షా డ్యాన్స్ చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. కుటుంబీకులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో యువతి కుటుంబలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.