చంద్రబాబు, పవన్‌పై ఈసీకి ఫిర్యాదు

49331చూసినవారు
చంద్రబాబు, పవన్‌పై ఈసీకి ఫిర్యాదు
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై ఎన్నికల సంఘానికి వైసీపీ మరోసారి ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. గతంలో ఇదే అంశంపై చంద్రబాబు, పవన్‌కు ఈసీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. బహిరంగ సభల్లో సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని 18 సార్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్