ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు నేపథ్యంలో సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాను విశాఖ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు బీజేపీ మాజీ ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు. ఇవాళ పార్టీ నేతలతో భేటీలో మాట్లాడుతూ విశాఖ నుంచి పోటీకి తనకు ఆసక్తి ఉన్నట్లు తెలిపారు. అయితే అధిష్టానం ఏ సీటు కేటాయించినా పోటీ చేసేందుకు సిద్ధమన్నారు.