విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి తెరపడిన వివాదం

76చూసినవారు
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి తెరపడిన వివాదం
విశాఖ స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్ట్ మధ్య వివాదం కొలిక్కి వచ్చింది. పోర్ట్ కార్మికుల డిమాండ్లకు యాజమాన్యం అంగీకరించింది. పోర్ట్ కార్మికులకు రూ.27 లక్షల చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపునకు, బకాయిలను వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు స్టీల్ ప్లాంట్ ప్రవేశపెట్టిన ప్రతిపాదనలకు పోర్ట్ యాజమాన్యం అంగీకరించింది. దీంతో కార్మికులు నెల రోజుల సమ్మెకు స్వస్తి చెప్పి ఎట్టకేలకు విధుల్లోకి చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్