చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిలిచిపోయింది. సీల్ సరిగ్గా లేదన్న కారణంతో జిల్లా కలెక్టర్ కౌంటింగ్ను ఆపించారు. తుది ఫలితాలను అధికారులు వెల్లడించలేదు. దీంతో ఏం జరుగనుందనే గందరగోళం నెలకొంది. పుంగనూరులో వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పోటీ చేయగా.. టీడీపీ తరపున చల్లా రామచంద్రా రెడ్డి (బాబు) బరిలో నిలిచారు.