నీళ్లు తక్కువగా తాగితే కిడ్నీలకు ముప్పు

66చూసినవారు
నీళ్లు తక్కువగా తాగితే కిడ్నీలకు ముప్పు
చాలామంది నీటిని తక్కువగా తాగుతుంటారు. అయితే నీటిని తక్కువగా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో నీరు లేనప్పుడు, మూత్ర పరిమాణం తగ్గుతుంది. మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు అధిక మొత్తంలో ఉంటాయి. మూత్రం ఎక్కువగా బయటకు రాకపోవడంతో ఈ ఖనిజాలు స్ఫటికాలుగా మారి కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి. అందుకే ప్రతిరోజు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్