AP: సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతించింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు ఆయన కుటుంబంతో కలిసి లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లనున్నారు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.