15 వరకు బదిలీలకు గడువు

72చూసినవారు
15 వరకు బదిలీలకు గడువు
16 శాఖల్లో బదిలీల గడువును పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ మినహా మిగిలిన శాఖల్లో బదిలీలను ఆగస్టు 31లోగా పూర్తి చేయాలని ఈ నెల 17న ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కానీ దాదాపు అన్ని శాఖల్లోనూ బదిలీలు ఇంకా కొలిక్కి రాలేదు. దాంతో గడువును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని శాఖల గడువును సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించింది. 16వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమలులోకి వస్తుందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

సంబంధిత పోస్ట్