చంద్రబాబుపై ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "చంద్రబాబు కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెడతారు. గతంలో ఆయన కాపులను రౌడీలని అనలేదా? ఎన్ని అన్యాయాలు చేసినా బాబు అంటే పవన్ కళ్యాణ్కు దేవుడు. చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చాడు. రాజకీయ భవిష్యత్తు కోసం వంగావీటి రంగాను చంపేశాడు." అని పోసాని ఆరోపించారు.