AP: వైసీపీ పాలనలో కుంభకోణాలపై నేడు శాసనమండలిలో చర్చ జరగనుంది. 2019-24 మధ్య మాజీ సీఎం జగన్ హయాంలో జరిగిన కుంభకోణాలపై లఘు చర్చ జరపనున్నారు. శాసనసభలో భూమి హక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అలాగే రైతు సాయం అమలు కోసం విధివిధానాలపై చర్చించే అవకాశం ఉంది.