AP: ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయింపు చట్టం కింద ఆయనపై శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు చర్యలు తీసుకున్నారు. కాగా, వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన రఘురాజు టీడీపీలో చేరారు. దీనిపై మండలి చైర్మన్కు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు విచారణ చేసిన మండలి చైర్మన్.. రఘురాజుపై చర్యలకు ఉపక్రమించారు.