ఇంటింటి ప్రచారానికి అనుమతి తీసుకోవాల్సిందేనని సీఈవో ముకేశ్కుమార్ మీనా సూచించారు. సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల అనుమతులకు సువిధ పోర్టల్ suvidha.eci.gov.in వినియోగించాలని అన్నారు. 48 గంటల ముందుగానే సువిధ యాప్, పోర్టల్ నుంచి సంబంధిత రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసిన 24 గంటల్లోగా ప్రచారానికి సంబంధించిన అన్ని అనుమతులు జారీ అవుతాయని స్పష్టం చేశారు.