మద్యం మత్తులో పందెం.. వరదలో కొట్టుకుపోయాడు (వీడియో)

77చూసినవారు
మద్యం మత్తలో వేసుకున్న పందెం వల్ల ఓ వ్యక్తి వరద నీటిలో మునిగాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సోమవారం జరిగింది. ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి పందెం వేసుకున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరులో దూకారు. వీరిలో ఒకరు ఒడ్డుకు చేరుకోగా.. మాడుగుల చంటి అనే వ్యక్తి వరదలో కొట్టుకుపోయాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్