వర్షాల కారణంగా వాతావరణం చల్లబడటంతో ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం లభించింది. అయితే వడగాలులు మళ్లీ రానున్నాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజస్థాన్లో ఈ నెల 21 వరకు నెలకొనే తీవ్ర ఉష్ణోగ్రతలే దీనికి కారణమని వివరించింది. అక్కడి నుంచి వేడిగాలులు మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, యూపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఝార్ఖండ్, బిహార్, తెలంగాణ, ఏపీకి విస్తరిస్తాయని పేర్కొంది.